సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట విజయలక్ష్యంగా 545 పరుగులను కంగారులు నిర్ణయించారు. తొలి ఇన్నింగ్స్లో 246 పరుగుల ఆధిక్యం సాంధించిన కంగారులు రెండో ఇన్నింగ్స్లో సఫారీ బౌలర్ల ధాటికి కేవలం 207 పరుగులకే కుప్పకూలారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు ముంగిట 454 పరుగుల విజయలక్ష్యం ఖరారైంది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో కలిస్, ఎన్తిని మూడు, పాల్ హారిస్ రెండు, మోర్కెల్, డేల్ స్టెయిన్ వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన స్మిత్సేన నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో రెండు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.
హషీమ్ ఆమ్లా (43), జాక్వస్ కలిస్ (26) క్రీజులో కొనసాగుతున్నారు. సఫారీలు విజయం సాధించాలంటే ఆఖరి రోజైన సోమవారం మరో 276 పరుగులు చేయాల్సి ఉండగా, చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.