తొలి టెస్ట్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన

బంగ్లాదేశ్‌తో సెయింట్ విన్సెంట్‌లో జరిగే తొలి టెస్ట్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఇందులో 19 ఏళ్ల బ్యాట్స్‌మన్ ఆండ్రియాన్ బరాత్ చోటుదక్కించుకున్నాడు. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన 13 మంది ఆటగాళ్ల బృందంలో జమైకా సీమర్ ఆండ్ర్యూ రిచర్డ్‌సన్ కూడా ఉన్నాడు.

రిచర్డ్‌సన్ మేలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ జట్టులోనూ చోటుదక్కించుకున్నాడు. అయితే అతనికి ఈ సిరీస్‌లో తుది జట్టులో అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాలో పుట్టిన బ్రెండన్ నాష్, ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో ఆకట్టుకున్న యువ పేస్‌బౌలర్ రవి రామ్‌పాల్‌లు కూడా టెస్ట్ జట్టులోకి వచ్చారు.

వెస్టిండీస్ జట్టు: క్రిస్ గేల్ (కెప్టెన్), దనేష్ రామ్‌దిన్ (వైస్ కెప్టెన్), ఆండ్రియాన్ బరత్, డ్వానే బ్రావో, సులేమాన్ బెన్, శివనారాయణ్ చందర్‌పాల్, నర్సింగ్ డేవ్‌నరీన్, రునాకో మోర్టాన్, బ్రెండన్ నాష్, రవి రామ్‌పాల్, ఆండ్ర్యూ రిచర్డ్‌సన్, రామ్‌నరేష్ శర్వాణ్, జెరోమే టేలర్.

వెబ్దునియా పై చదవండి