పద్మశ్రీ అవార్డును అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ!

FILE
టీమ్ ఇండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ ఈ అవార్డును ధోనీకి అందజేశారు.

వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును ధోనీ తీసుకోవాల్సి ఉండగా, ఆ కార్యక్రమానికి ధోనీ హాజరు కాలేదు. అభిమానుల హృదయాలను గాయపరిచాడంటూ.. దీనిపై పెద్ద దుమారం కూడా రేగింది.

ఇంకా బీహార్ కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు వివరణ కోరుతూ.. గత మాసం ధోనీకి నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ చేతుల మీదుగా స్వీకరించాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

వెబ్దునియా పై చదవండి