ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐసీఎల్)కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఐసీఎల్కు జరిగిన నష్టంపై డిసెంబరు ఏడో తేదీ లోపు స్పందించని పక్షంలో ఇంగ్లండ్ కోర్టులో దావా వేస్తానని బీసీసీఐకి లీగల్ నోటీసు పంపిన సంగతి తెలిసిందే.
ఈ లీగల్ నోటీసుకు స్పందించిన ఢిల్లీ హైకోర్టు బీసీసీఐపై ఇంగ్లండ్ కోర్టులో దావా వేయకూడదని ఐసీఎల్కు ఆదేశించింది. ఎస్సెల్ స్పోర్ట్స్ లిమిటెడ్ (ఐసీఎల్) తనపై దావా వేయకుండా అడ్డుకోవాలని బీసీసీఐని హైకోర్టు అభ్యర్థించింది. దీనిపై మంగళవారం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.