బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ: ఫైనల్లో మహారాష్ట్ర, కేరళ
ఆదివారం, 28 ఆగస్టు 2011 (12:25 IST)
సీమర్ డొమినిక్ జొసెఫ్ ముత్తుస్వామి 53 పరులిచ్చి నాలుగు వికెట్లు తీసుకోవడంతో శనివారం చైన్నైలో జరిగిన ప్రతిష్ఠాత్మక ఆలిండియా బుచ్చిబాబు క్రికెట్ టోర్నమెంట్ సెమీ ఫైనల్స్లో మహారాష్ట్ర జట్టు ముంబాయిని 152 పరుగుల తేడాతో ఓడించింది. సోమవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ఫైనల్లో మహారాష్ట్ర కేరళతో తలపడుతుంది.
తొలుత మహారాష్ట్ర తొమ్మిది వికెట్ల నష్టానికి 379 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబాయి ఏ దశలోనూ లక్ష్యం సాధించే దిశగా కనిపించలేదు. ఏడో ఓవర్లో ఓపెనర్ స్వప్నిల్ సాల్వీ వికెట్ను కోల్పోయింది. కౌస్తుభ్ పవార్ (43), సిద్ధార్ధ ఛిట్నీస్ (46), ఆంకార్ గౌరవ్ (37)లు కొంతమేర రాణించారు.