భారత్-శ్రీలంక-పాక్‌ల మధ్యే పోటీ ఉంటుంది: రైనా

భారత ఉపఖండంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య గట్టిపోటీ నెలకొంటుందని టీమిండియా యంగ్ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా కథ ముగిసింది. ప్రస్తుతానికి వరల్డ్ కప్ కోసం భారత్, పాకిస్థాన్, శ్రీలంకలు పోటీ పడుతాయని రైనా వ్యాఖ్యానించాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో పోల్చితే గత నాలుగేళ్లలో భారత్‌తో పాటు పాకిస్థాన్, శ్రీలంక జట్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకున్నాయని సురేష్ రైనా అన్నాడు.

అయితే ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఛాలెంజింగ్‌గా రాణించే అవకాశం ఉందని రైనా చెప్పాడు. యాషెస్ సీరిస్‌లో ఇంగ్లాండ్ ప్రదర్శించిన ఆటతీరును బట్టి చూస్తే ప్రపంచకప్‌లో మెరుగ్గా ఆడే అవకాశం ఉందని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు.

వెబ్దునియా పై చదవండి