మరోసారి చేతులెత్తేసిన టీమిండియా: 224 ఔట్

బుధవారం, 10 ఆగస్టు 2011 (22:03 IST)
మూడో టెస్ట్ తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండు బౌలింగు దెబ్బకు కుదేలైన భారత జట్టు కుప్పకూలి 224 పరుగులకే ఆలౌట్ అయ్యింది. విరగదీస్తాడనుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ఒకే ఒక్క బంతితో డకౌటై వెనుదిరిగాడు. గంభీర్(38) కుదురుకున్నాడని అనుకునేలోపే క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1) ఒకే ఒక్క పరుగు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. రాహుల్ ద్రవిడ్(22), లక్ష్మణ్(30), రైనా(4), మిశ్రా(4), ప్రవీణ్(26), ఇషాంత్(4)లు వరుసగా పెవిలియన్ దారిపట్టారు.

అయితే ఈసారి కెప్టెన్ ధోనీ ఒంటరి పోరాటం చేశాడు. 77 పరుగులు చేసి జట్టు స్కోరు 224కు చేరుకునేందుకు సాయపడ్డాడు. మొత్తమ్మీద మరోసారి టీమిండియా పేలవమైన ఆటతీరును కనబర్చింది.

వెబ్దునియా పై చదవండి