మాస్టర్ సచిన్ కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుండు: లతిఫ్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కౌన్సిలింగ్ తీసుకుంటే బాగుండునని మాజీ పాకిస్థాన్ కెప్టెన్ రషీద్ లతీఫ్ సూచించాడు. వందో సెంచరీపై అభిమానులు చేస్తున్న ఒత్తిడితో సచిన్ మైండ్ బ్లాక్ అయ్యిందని, అందుచేత ఆ ఒత్తిడి నుంచి సచిన్ బయట పడాలంటే తప్పకుండా సచిన్ కౌన్సింగ్ తీసుకోవాలని లతిఫ్ అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతానికి సచిన్ టెండూల్కర్ ఒత్తిడిలో ఉన్నాడు. వందో సెంచరీ అనే మైలురాయిని దాటాలనే ఒత్తిడి అతనిపై ఉంది. మీడియా, క్రికెట్ అభిమానులు సచిన్ వందో సెంచరీ చేయాలని ఫోకస్ చేయడం మాస్టర్‌పై ఒత్తిడి పెంచుతోందని.. అందుచేత మాస్టర్ సైకాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని లతిష్ సూచించాడు.

సచిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. మిడిలార్డర్‌లో మాస్టర్ క్రీజులో నిలదొక్కుకోగలుగుతున్నాయి. అయితే ఒత్తిడి వల్ల వందో సెంచరీ చేయలేకపోతున్నాడు. ఆసీస్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లోనూ మాస్టర్ అర్థసెంచరీలను నమోదు చేసుకున్నాడు. అయితే వందో శతకాన్ని నమోదుచేసుకోవడంలో సచిన్ విఫలమయ్యాడు అని లతిఫ్ వెల్లడించాడు.

వెబ్దునియా పై చదవండి