ముక్కోణపు వన్డే సిరీస్: ఐదు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

FILE
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా.. భారత్-శ్రీలంకల మధ్య జరుగుతోన్న కీలక వన్డేలో భారత్ బౌలర్లు రాణిస్తున్నారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

భారత్ యువ బౌలర్ త్యాగి విసిరిన మొదిటి బంతికే శ్రీలంక ఓపెనర్ తరంగ డకౌట్‌తో వెనుదిరగగా, మరో ఓపెనర్ 33 పరుగుల వద్ద జహీర్ బౌలింగ్‌లో పెవిలియన్ ముఖం పట్టాడు. తర్వాత బరిలోకి దిగిన జయవర్ధనే 5, సమరవీర పరుగులేమీతో జహీర్, శ్రీశాంత్ బౌలింగ్‌లో ఇంటిదారి పట్టారు. కదంబీ మాత్రం అనవసరపు రన్‌కు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు.

ప్రస్తుతం సంగక్కర (28), పెరీరా (2)లు క్రీజులో ఉన్నారు. దీంతో శ్రీలంక 16.4 ఓవర్లలో శ్రీలంక ఐదు వికెట్ల పతనానికి 70 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టగా, త్యాగి, శ్రీకాంత్‌లు చెరో వికెట్ సాధించారు.

వెబ్దునియా పై చదవండి