ముగిసిన వరల్డ్‌కప్: క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పండుగ!

ప్రపంచకప్ సమరానికి శనివారంతో తెరపడటంతో ఐపీఎల్ సంగ్రామం ప్రారంభం కానుంది. కపిల్ డెవిల్స్‌‌కు తర్వాత 28 ఏళ్ల విరామానికి అనంతరం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ధోనీ డెవిల్స్ ప్రపంచకప్ గెలుచుకోవడం పట్ల క్రికెట్ అభిమానులు పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో, పొట్టి ఓవర్ల మెగా ఈవెంట్ ఐపీఎల్ ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభం కానుంది.

20 ఓవర్ల ఐపీఎల్ మ్యాచ్‌లు త్వరలోనే క్రికెట్ అభిమానులను ఆకట్టుకోనున్నాయి. 28 తారీఖు వరకు జరిగే ఐపీఎల్ పోటీల్లో మొత్తం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచకప్ టోర్నీ అభిమానులను నలభై రోజులు అలరించింది. ఇక ట్వంటీ-20 టోర్నీ మరో యాభై రోజులు అభిమానులను ఆకట్టుకోనుంది.

వెబ్దునియా పై చదవండి