ప్రతిష్టాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్లో భాగంగా గురువారం లార్డ్స్ మైదానంలో ప్రారంభమైన రెండో టెస్టులో ఇంగ్లండ్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. దీంతో తొలి రోజు లంచ్ సమయానికి ఇంగ్లండ్ జట్టు వికెట్ నష్టపోకుండా 126 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఆండ్రూ స్ట్రాస్ 47, అలిస్టర్ కుక్ 67 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, కుక్ మాత్రం టెస్టు కెరీర్లో తన 20వ అర్థ సెంచరీని పూర్తి చేశాడు. ఇంగ్లండ్ ఓపెనర్లు ఆసీస్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ప్రపంచ మూడో ర్యాంకు బౌలర్ మిచెల్ జాన్సన్ బౌలింగ్ను ఇంగ్లీష్ ఓపెనర్లు ఉతికి ఆరేశారు. జాన్సన్ వేసిన ఎనిమిది ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు.