రెచ్చిపోయిన గంభీర్... ఎట్టకేలకు కోల్‌కతాకు విజయం!

గురువారం, 8 మే 2014 (10:56 IST)
FILE
నాలుగు వరుస ఓటముల తర్వాత కోల్‌కతా పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కెప్టెన్ గౌతం గంభీర్ రెచ్చిపోవడంతో బుధవారం జరిగిన ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి ఉంచిన 161 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేధించింది. కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌లలో కెప్టెన్ గంభీర్ (69), ఊతప్ప (47) రాణించారు. గంభీర్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లలో ఓపెనర్ డికాక్ (10), కెప్టెన్ పీటర్సన్ (6) విఫలమయ్యారు. విజయ్ (24), కార్తీక్ (34) రాణించారు. కేదార్ జాదవ్ (26 నాటౌట్), డుమిని (40) చివర్లో చెలరేగడంతో ఢిల్లీ స్కోరు 160 మార్కును చేరింది. అనంతరం కోల్‌కతా కెప్టెన్ గంభీర్, ఉతప్ప మెరుపు బ్యాటింగ్‌తో ఢిల్లీకి ఓటమిని మిగిల్చారు.

వెబ్దునియా పై చదవండి