ఇంగ్లాండ్తో జరిగే ఏకైక ట్వంటీ20 మ్యాచ్తో పాటు ఐదు వన్డేల సిరీస్కు గానూ శనివారం భారత జట్టు ఎంపిక జరుగనుంది. జట్టు ఎంపికకు సెలక్టర్లు చెన్నైలో సమావేశం కానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(బీసీసీఐ) వర్గాలు తెలిపాయి.
ఒకే ఒక ట్వంటీ20 మ్యాచ్ ఆగస్ట్ 31న ఓల్డ్ ట్రాఫ్ఫోర్డ్లో జరుగనుంది. అనంతరం సెప్టెంబర్ 3 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. చివరిదైన ఐదో వన్డే సెప్టెంబర్ 16న కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్లో ఆడుతున్న రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, అభినవ్ ముకుంద్లు సిరీస్ ముగిసిన వెంటనే స్వదేశానికి తిరిగి రానున్నారు.