శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ను కైవసం చేసుకుంటే టీం ఇండియాకు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానం దక్కనుంది. దీంతో టీం ఇండియా ఆటగాళ్లు ఈ "కాంపాక్ కప్"ను కైవసం చేసుకోవడంపై దృష్టి పెట్టారు. న్యూజిలాండ్, శ్రీలంకలతో జరుగుతున్న ఈ ముక్కోణపు సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ శుక్రవారం ఆడబోతుంది.
ఈ సిరీస్లో అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధిస్తే.. టీం ఇండియా వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకుంటుంది. ప్రస్తుతం మహేంద్ర సింగ్ ధోనీ సేనకు కూడా నెంబర్వన్ అని పిలుపించుకోవడమే ప్రధాన లక్ష్యంగా ఉంది. దీనికి ధోనీ సేన మూడు మ్యాచ్ల దూరంలో ఉంది. రెండు లీగ్ మ్యాచ్లు, అనంతరం జరిగే ఫైనల్స్ను గెలిస్తే ధోనీ సేన ప్రపంచంలో నెంబర్వన్ వన్డే జట్టుగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగుపెడుతుంది.