నార్తాంప్టన్షైర్తో శుక్రవారం ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్(8), గౌతమ్ గంభీర్ వికెట్లను త్వరగా కోల్పోయింది. భారత్ 28 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. అభినవ్ ముకుంద్(42), వీవీఎస్ లక్ష్మణ్(14)లు క్రీజ్లు ఉన్నారు.
అంతకు ముందు స్టాండిన్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆడుతున్నప్పటికీ ఓపెనర్ గంభీర్ నాయకత్వం వహిస్తున్నాడు. వృద్ధిమాన్ సాహా జట్టులో ఉన్నందున ధోనీ ఎక్కువ సేపు కీపింగ్ చేసే అవకాశం లేదు.
మూడో టెస్ట్కు ముందు జరుగుతున్న ఈ మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, గంభీర్లపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ మ్యాచ్కు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ప్రవీణ్ కుమార్లకు విశ్రాంతి కల్పించారు. ఆగస్ట్ 10 నుంచి ఎడ్జ్బాస్టన్లో ప్రారంభమయ్యే కీలకమైన మూడో టెస్ట్లో ఈ ముగ్గురు ఆటగాళ్లు ప్రధానం.
రోజుకు 90 ఓవర్ల పాటు జరిగే ఈ మ్యాచ్లో ఒక్కో జట్టు వంద ఓవర్ల పాటు ఆడుతుంది. 12 మంది ఆటగాళ్లు జట్టులో ఉంటారు.