అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేలోపే టీం ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు.
భారత క్రికెట్ జట్టును సరైన బాటలో నడిపించే సత్తా సెహ్వాగ్కు ఉందని, సెహ్వాగ్ ఇంకా ఐదు లేకు ఆరు సంవత్సరాలు క్రికెట్ ఆడుతాడని గంగూలీ నమ్మకం వ్యక్తం చేశాడు.
అంతలోపు లేదా చివరి రెండు సంవత్సరాల్లో టీం ఇండియాకు కెప్టెన్సీ పగ్గాలను స్వీకరించే అవకాశం సెహ్వాగ్కు వస్తే.. దానిని వీరూ నిరాకరించకూడదని బెంగాల్ దాదా అన్నాడు.
టీం ఇండియా క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలను ఓ యువ క్రికెటర్కు అప్పగించి.. ఆ తర్వాత అతనిని కెప్టెన్గా సిద్ధం చేయాలని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్న విధానంపై గంగూలీ మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలను వీరేంద్ర సెహ్వాగ్ ఆలోంచించాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు తెలిపాడు.