ప్రస్తుతం వెస్టిండీస్ టెస్ట్ కెప్టెన్గా వున్న ఆల్ రౌండర్ సామీపై వెస్టిండిస్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అతని స్థానంలో రామ్దిన్కు జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు రామ్దిన్కు వెస్టిండీస్ సెలెక్టర్లు ముందే సమాచారం అందించారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ) డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశంపై తొలుత రామ్దిన్తో సెలెక్షన్ చైర్మన్ ఫోన్లో మాట్లాడారు.