టీమిండియాను ఢీకొట్టడం అంత సులభం కాదు : శ్రీలంక కెప్టెన్

గురువారం, 30 అక్టోబరు 2014 (12:44 IST)
సొంతగడ్డపై భారత్ క్రికెట్ జట్టుతో తలపడటం అంత తేలిక కాదని శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ ఏంజెంలో మాథ్యూస్ వెల్లడించారు. ప్రస్తుతం వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టు భారత్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. ఈ సందర్భంగా మాథ్యూస్ మీడియాతో మాట్లాడుతూ భారత్‌తో జరగనున్న సిరీస్ విషయంలో తాము అయిష్టతతో ఉన్నట్టు మీడియాలో వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చాడు. 
 
కాకపోతే, సిరీస్‌కు తాము సన్నద్ధం కాలేదనేదే తమ అభ్యంతరమన్నాడు. పైపెచ్చు భారత్‌ను వారి సొంతగడ్డపై ఢీకొనడం అంత సులువు కాదని... పూర్తి స్థాయిలో సన్నద్ధమైతేనే టీమిండియాను ఢీకొనగలమని తెలిపాడు. పాకిస్థాన్ సిరీస్ తర్వాత తమకు రెండు నెలల విరామం దొరికిందని... పది రోజుల విశ్రాంతి తీసుకున్న తర్వాత ఫిట్నెస్ కార్యక్రమాన్ని ఆరంభించామని... ఇంతలోనే కథ మలుపు తిరిగడంతో భారత్‌కు రావాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి వాటిని తాము సానుకూలంగా స్వీకరిస్తామని తెలిపాడు. 

వెబ్దునియా పై చదవండి