ఈ మ్యాచ్లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... రెండు టీమ్లు సరిగ్గా 109.4 ఓవర్లకే ఆలౌట్ అయ్యాయి. తొలి ఇన్నింగ్స్ లో 97 పరుగుల ఆధిక్యాన్ని సాధించడంతో... ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠ స్థితికి చేరుకుంది. ఈ స్కోరును సమం చేసి, ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలంటే భారత్ టాప్ ఆర్డర్ నిలదొక్కుకోవాల్సి ఉంటుంది.
భారత ఇన్నింగ్స్లో మురళీ విజయ్ సెంచరీతో ఆదుకున్న విషయం తెల్సిందే. అలాగే, ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో తాత్కాలిక కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (133), జాన్సన్ (88), స్ట్రాక్ (52), హాజ్లీవుడ్ (32 నాటౌట్)లు భారత బౌలర్లకు చుక్కలు చూపించి, భారీ స్కోరు చేసేలా దోహదపడ్డారు.