విండీస్‌ రూ.258కోట్లు నష్టపరిహారం చెల్లించాలి: బీసీసీఐ

శనివారం, 1 నవంబరు 2014 (13:46 IST)
భారత్‌లో ఇటీవల టూర్‌ను మధ్యంతరంగానే ముగించడంపై దావా వేయకుండా ఉండాలంటే విండీస్ బోర్డు రూ.258 కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ.. బీసీసీఐ తెలిపింది. భారత పర్యటన నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం ద్వారా తమకు ఎంతో నష్టం వాటిల్లిందని బీసీసీఐ తెలిపింది. 
 
ప్రసార హక్కుల అంశంలో తాము భారీగా నష్టపోయామని బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డుకు లేఖ రాశామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని లేఖలో పేర్కొన్నట్టు పటేల్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి