బీసీసీఐ కూడా ఇక ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుంది: శర్వానంద

గురువారం, 29 జనవరి 2015 (12:15 IST)
స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. 
 
ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సోనోవాల్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. 
 
బోర్డు పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలని, వాటిని బహిర్గతం చేయాల్ని అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇటీవల ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఇచ్చిన తీర్పులో పేర్కొందని సోనోవాల్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి