విండీస్తో సొంతగడ్డపై సిరీస్కు ఫ్లెచర్ వైదొలగాలనుకుంటే తామేమీ అడ్డుపడబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో, వచ్చే సిరీస్కు భారత జట్టుకు కొత్త కోచ్ రానుండడం ఖాయమేననిపిస్తోంది. కాగా, టీమిండియాకు కోచ్గా వ్యవహరించడానికి రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్ తగిన వ్యక్తులని క్రీడాపండితులంటున్నారు.
ప్రస్తుత జట్టులోని అత్యధికులతో డ్రెస్సింగ్ రూం పంచుకుని ఉండడం ద్రావిడ్కు కలిసొచ్చే అంశం. పైగా, క్రికెటర్లలో మర్యాద రామన్నగానూ పేరుంది. ఏదేమైనా, టీమిండియా కొత్త కోచ్ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!