ఈ గెలుపుపై ధోనీ స్పందిస్తూ... కీలక దశలో రైనా ఎంతో వేగంగా ఆడాడని, ముఖ్యంగా సాధికారికమైన షాట్లతో ఇంగ్లండ్ బౌలర్ల పనిబట్టాడని తెలిపాడు. రైనా ప్రదర్శన ఇంగ్లండ్కు పరాజయం మిగిల్చిందన్నాడు. కాగా, ఈ ఇన్నింగ్స్తో రైనాకు వరల్డ్ కప్ బెర్తు ఖాయమైనట్టేనా..? అన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ, అతడు మెరుగైన ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మరోరకంగా ప్రశ్నించి ఉండేవాళ్ళని చురకంటించాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదో వికెట్ కు రైనా-ధోనీ 144 పరుగులు జోడించడంతో భారీ స్కోరు సాధించడం తెలిసిందే. సెంచరీతో విరుచుకుపడిన రైనా సరిగ్గా 100 పరుగులు చేసి వెనుదిరిగాడు. 75 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో శతకం చేశాడు.