చాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన తర్వాత విదేశాల్లో మనవాళ్ళ ప్రదర్శన పేలవంగా ఉందన్న ఈ కర్ణాటక క్రికెటర్, పర్యటనను విజయంతో ముగించాలని సూచించాడు. అయితే, వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో వ్యక్తిగతంగా రాణించేందుకు యువ క్రికెటర్లు ఈ ఛాన్సును సద్వినియోగం చేసుకోవాలన్నాడు.
ఇక, ఈ సిరీస్లో సురేశ్ రైనా, సంజు శాంసన్, అంబటి రాయుడు వంటి యువకులతో జట్టులో తాజాదనం కనిపిస్తోందని, జట్టుకు అది లాభిస్తుందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు.