పాకిస్థాన్లోని ఓరంగి పట్టణంలో క్లబ్ మ్యాచ్ ఆడుతున్న జీషన్ మొహమ్మద్ అనే యువ క్రికెటర్ ప్రత్యర్థి పేసర్ వేసిన బంతి బలంగా ఛాతీకి తగలడంతో సంఘటనా స్థలంలోనే కుప్పకూలాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించగా, అప్పటికే జీషన్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.