వెంగీకి సీకే నాయుడు అవార్డు.. రోహిత్‌కు బీసీసీఐ ప్రత్యేక అవార్డు!

శనివారం, 22 నవంబరు 2014 (11:43 IST)
సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డుకు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్‌కు ఎంపిక కాగా, టీమిండియా సభ్యుడిగా వెంగ్ సర్కార్ 116 టెస్టులు, 129 వన్డేలు ఆడాడు. 
 
ఇక వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మను బీసీసీఐ ప్రత్యేక అవార్డు వరించింది. 
 
భారత మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు పాలీ ఉమ్రీగర్ అవార్డు దక్కింది. శుక్రవారం రాత్రి ముంబైలో జరిగిన కార్యక్రమంలో బీసీసీఐ ఈ అవార్డులను క్రికెటర్లకు ప్రదానం చేసింది. హైదరాబాద్ కు చెందిన అండర్-19 క్రికెటర్ అనిరుథ్‌కు ఎంఏ చిదంబరం ట్రోఫీ దక్కింది.

వెబ్దునియా పై చదవండి