అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.