ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ : టైటిల్‌పై కన్నేసిన భారత్

సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:51 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌పై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నేశాడు. మొత్తం ఐదు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు పూర్తయ్యాయి. వీటిలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు వన్డే మ్యాచ్‌లలో టీమిండియా విజయభేరీ మోగించింది. దీంతో వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
తాజాగా, మంగళవారం జరిగే నాలుగో వన్డేలోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలివుండగానే టైటిల్ విజేతగా నిలవాలని ధోనీ కలలుగంటున్నారు. ఇందుకు అనుగుణంగా సహచరులను సమాయత్తం చేస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ధోనీసేన వరుస విజయాలతో సమరోత్సాహంతో ఉంది. కాగా ఇంగ్లండ్కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. సిరీస్ గెలిచి అవకాశాల్లేని ఇంగ్లీష్‌మెన్ కనీసం సమం చేసి గౌరవం దక్కించుకోవాలంటే  చివరి రెండు వన్డేల్లో గెలిచితీరాలి. ధోనీసేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. కుక్ సేన ఒత్తిడిలో ఉంది. 

వెబ్దునియా పై చదవండి