ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ స్థానంలో భారత్కు మరో ప్రత్యామ్నాయం కన్పించడం లేదని, కాబట్టి 2015 వరల్డ్ కప్ వరకూ మహీనే కెప్టెన్గా కొనసాగించాలని సౌరవ్ సూచించాడు. వచ్చే ప్రపంచ కప్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగనుందన్నారు.
అయితే, ఈ టోర్నీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ బౌన్సీ ట్రాక్లపై జరుగుతుందని, ఇది భారత ఉపఖండపు ఆటగాళ్లకు కఠిన సవాలుతో కూడుకున్న పని అని చెప్పారు. అయితే విదేశాల్లో టెస్టు మ్యాచ్లు మాత్రమే భారత్కు సమస్య. వన్డే ప్రదర్శనపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.