"2011-12లో మేం 4-0తో నెగ్గాం, వాళ్లు 2012-13లో 4-0తో భారత్లో నెగ్గారు. ఇప్పుడు వాళ్లు ఇక్కడికి వస్తే అదే ఫలితం వస్తుంది" అని మెక్గ్రాత్ను ఉటంకిస్తూ 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' పత్రిక పేర్కొంది. కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయంతో తప్పుకున్నా, భారత్ టెస్టు సిరీస్లో ఆసీస్కు సవాల్ విసరలేదని ధీమాగా చెప్పాడు.
విదేశీ గడ్డపై భారత్ పేలవ ప్రదర్శన గురించి చెబుతూ, ఇటీవల ముగిసిన ఇంగ్లండ్ పర్యటనను ఎత్తిచూపాడు. ఆ పర్యటనలో చివరి మూడు టెస్టుల్లో టీమిండియా ఓటమిపాలైందన్నాడు. ప్రస్తుత భారత జట్టులో సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్ స్థాయిలో ఆడే ఆటగాళ్లు లేరని మెక్గ్రాత్ గుర్తు చేశాడు.