ఇక, ఆశాకిరణం పుజారా (4) సైతం స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. బ్రాడ్కు ఈ వికెట్ దక్కింది. ఈ పొడగరి పేసర్ విసిరిన బంతి పుజారా బ్యాట్, ప్యాడ్కు మధ్య ఖాళీలోంచి వెళ్ళి బెయిల్స్ను ఎగరగొట్టింది. దీంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం భారత్ స్కోరు 2 వికెట్లకు 12 పరుగులు కాగా, ఓపెనర్ మురళీ విజయ్ (8*) జతగా, విరాట్ కోహ్లీ (0*) క్రీజులో ఉన్నాడు.