టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీసుకు డుమ్మా కొట్టాడు. చివరి టెస్టు శుక్రవారం ఆరంభం కానుండగా, ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాలు చవిచూసిన టీమిండియా నెట్ ప్రాక్టీసును సీరియస్గా తీసుకోలేదు. అటు కెప్టెన్గా, ఇటు బ్యాట్స్మన్గా విఫలమవుతున్న ధోనీ నెట్స్లో చెమటోడ్చితే కాసింత ఫలితం ఉంటుందన్నది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ధోనీ గైర్హాజరీతో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ ల పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీసు కొనసాగింది. ఇదిలావుంటే, భారత్ కు ఐదో టెస్టు ముంగిట ఓ శుభవార్త. గాయంతో రెండు మ్యాచ్లకు దూరమైన ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్నెస్ సాధించాడు. దీంతో, ఈ పొడగరి స్పీడ్ స్టర్ రేపటి మ్యాచ్కు బరిలో దిగే అవకాశాలున్నాయి