ఆస్ట్రేలియాలో భారత్‌కు గడ్డుకాలమే, చెమటోడ్చక తప్పదు: మెక్ గ్రాత్

సోమవారం, 18 ఆగస్టు 2014 (18:52 IST)
ఇంగ్లండ్ పర్యటనలో భారత్ ఓడిపోవడంతో కంగారూలు ఎద్దేవా చేస్తున్నారు. భారత జట్టుకు ఆస్ట్రేలియా పర్యటన కఠిన పరీక్షేనని ఫాస్ట్ బౌలర్, మాజీ క్రికెటర్ మెక్ గ్రాత్ అన్నారు. ఆస్ట్రేలియాను ఎదుర్కొనేందుకు భారత జట్టు చెమటోడ్చాల్సిందేనని మెక్ గ్రాత్ తెలిపారు. 
 
ఇంగ్లాండ్ పర్యటనలో దారుణ ఓటమి తర్వాత..ఈ సంవత్సరాంతంలో ఆస్ట్రేలియాలో భారత జట్టు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని మెక్ గ్రాత్ జోస్యం చెప్పారు. క్యాచ్ లు వదిలేయడం ద్వారా భారత్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగిందన్నారు. 
 
గతంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో ఓటమి పాలైన సంగతిని ఆయన గుర్తు చేశారు. గత యాషెస్ సిరీస్‌లో భారత్‌ను ఓడించిన ఇంగ్లాండ్‌ను 5-0 తేడాతో ఆస్ట్రేలియా ఓడించిందని మెక్ గ్రాత్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి