భారత్ - ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్టులో బరిలోకి దిగనున్న మైకేల్ క్లార్క్‌!

సోమవారం, 24 నవంబరు 2014 (14:06 IST)
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వచ్చే నెల నాలుగో తేదీ నుంచి అడిలైడ్ వేదికగా జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మైకేల్ క్లార్క్‌ను బరిలోకి దించాలన్న పట్టుదలతో క్రికెట్ ఆఫ్ ఆస్ట్రేలియా (సీఏ) ఉంది. నిజానికి ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సీఏ ప్రకటించిన జట్టు సభ్యుల్లో మైకేల్ క్లార్క్ పేరు లేని విషయం తెల్సిందే. 
 
అయితే, జట్టులో అతడికి చోటు కల్పించారు. గాయం నుంచి వేగంగా కోలుకున్న క్లార్క్ ఫిట్నెస్ సాధించాడని, అందుకే అతడిని ఎంపిక చేశామని సెలెక్టర్ రాడ్నీ మార్ష్ తెలిపారు. క్లార్క్ లేకుండా బరిలో దిగి తొలి టెస్టులోనే ఓటమిపాలైతే ఆ ప్రభావం సిరీస్‌పై పడుతుందని ఆసీస్ సెలెక్టర్లు భావించినట్టు తెలుస్తోంది. కాగా, తొలి టెస్టుకు ముందు భారత జట్టుతో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో క్లార్క్ ఆడే అవకాశాలు ఉన్నాయి. 

వెబ్దునియా పై చదవండి