గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లలో మునిగిపోవడంతో, మొదటి అంతస్తులోనే ఉన్నామని, ఇంటి నుంచి బయటపడే అవకాశం లేకపోయిందని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ 11 రోజులు బాహ్య ప్రపంచంలో సంబంధం తెగిపోయిందన్నాడు.
గత 11 రోజులపాటు నరకం చూశాం. బయట అందరితోనూ సంబంధాలు తెగిపోయాయి. మేముంటున్న అనంతనాగ్లో టెలిఫోన్లు, మొబైల్ ఫోన్లు.. ఏవీ పని చేయలేదు. నేను, నా కుటుంబసభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం' అని రసూల్ తెలిపాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడిందని పర్వేజ్ రసూల్ చెప్పాడు.