ట్రెంట్ బ్రిడ్జిలో జరిగిన మొదటి టెస్టు సమయంలో భారత్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, లార్డ్స్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన అనంతరం జడెజా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాడు. భారత్ గెలిచిన వెంటనే అక్కడే ఉన్న అండర్స్తో జడెజా చేయి కలిపాడు.
కాగా, జడెజా, అండర్సన్ గొడవకు సంబంధించి వీడియో ఆధారాలు లేవట. నాడు కపిల్.. నేడు ధోనీ లార్డ్స్లో భారత్ ఇంతకుముందు 16 మ్యాచులు ఆడింది. అందులో గెలిచింది ఒక్కటే. ఇప్పుడు 17వ మ్యాచ్ ధోనీ సారథ్యంలో గెలిచింది. 28 ఏళ్ల క్రితం కపిల్ దేవ్ సారథ్యంలో చారిత్రక లార్డ్స్ గెలిచిన భారత్, మళ్లీ ఇప్పుడు గెలిచింది.
1986లో జూన్ 5-10 తేదీల మధ్య జరిగిన మ్యాచులో తొలి ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 294 పరుగులు చేయగా.. భారత్ 341 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్సులో ఇంగ్లాండ్ 180 పరుగులకు కుప్పకూలగా, 134 పరుగుల లక్ష్యాన్ని కపిల్ సేన 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.