ఐపీఎల్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంపై ముద్గల్ కమిటీ నివేదిక బహిర్గతమైంది. నివేదిక శ్రీనివాసన్కు ఊరట కలిగించేదే అయినప్పటికీ.. అతడి పైన ప్రశ్నలు మాత్రం మిగిలే ఉన్నాయి. మ్యాచ్ ఫిక్సింగ్తో శ్రీనివాసన్కు సంబంధం లేదని తేల్చిన కమిటీ. అవినీతి వ్యవహారాల గురించి తెలిసినా అతడు చర్యలు తీసుకోలేదని స్పష్టం చేసింది.
అలాగే, విచారణకు అతను ఆటంకం కలిగించలేదని పేర్కొందని అంటూ నివేదికలోని కొన్ని అంశాలను బయటపెట్టింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన బోర్డు కీలక వార్షిక సర్వసభ్య సమావేశం (ఎజిఎం)పై నిర్ణయాన్ని తీసుకోవడానికి మంగళవారం పాలక మండలి సమావేశం కానున్న నేపథ్యంలో ఫిక్సింగ్ కేసులో శ్రీని పాత్ర లేదని ముద్గల్ కమిటీలో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు ప్రకటించడం విశేషం.