ప్రపంచకప్ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్కు హామీ ఇచ్చాడు.