23 రోజుల్లో ప్రపంచకప్ : భారత్‌ను మట్టికరిపిస్తుంది... మిస్పా..!

గురువారం, 22 జనవరి 2015 (12:38 IST)
ప్రపంచకప్‌ మరో 23 రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. ఇప్పటికే వరల్డ్ కప్ కోసం తమ జట్టు సన్నద్ధమైందని, పాకిస్థాన్ జట్టు సాధ్యమైనంతవరకు మెరుగైన ప్రదర్శన ఇస్తుందని మిస్బా ఫ్యాన్స్‌కు హామీ ఇచ్చాడు. 
 
మిస్బా ఇంకా మాట్లాడుతూ... వచ్చే ప్రపంచకప్‌లో టీమిండియాను మట్టికరిపించి పాకిస్తాన్ క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాయనుందని కెప్టెన్ మిస్బావుల్-హక్ జోస్యం చెప్పాడు. అడిలైడ్‌లో ఫిబ్రవరి 15వ తేదీన జరిగే పోరులో విజయం సాధించి ప్రపంచకప్ చరిత్రను తిరగరాస్తామన్నాడు.

వెబ్దునియా పై చదవండి