ఆండర్సన్‌తో రచ్చ : రవీంద్ర జడేజా దోషే .. మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత!

శుక్రవారం, 25 జులై 2014 (17:06 IST)
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌తో గొడవ పడిన వివాదంలో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దోషిగా తేలాడు. అతడిని అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడ్డారు. 
 
ఈ వ్యవహారంలో ఆండర్సన్‌తో వివాదంలో జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది. అలాగే, జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ వద్ద విచారణ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటున్న అండర్సన్‌ను.. 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు. ఇందులో అతను దోషిగా తేలితే మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి