భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అమిత్ షా చేతుల మీదుగా క్రికెటర్, భారతరత్న సచిన్ టెండుల్కర్, అలనాటి ప్రముఖ డ్యాన్సింగ్ క్వీన్ హెలెన్లు జెయింట్ ఇంటర్నేషనల్ అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమం ముంబైలో జరిగింది. సచిన్ టెండుల్కర్తో పాటు హెలెన్ సలీమ్ ఖాన్ కూడా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు.
సచిన్ క్రీడల్లో, హెలెన్ సినిమాలకు సంబంధించి ఈ అవార్డును అందుకున్నారు. కాగా, జెయింట్ ఇంటర్నేషనల్ 1972 సెప్టెంబర్ 17వ తేదీన స్థాపించారు. దీనిని నానా చూడసామ స్థాపించారు.