ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు.. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ.. ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిశారు. ఈ అరుదైన సన్నివేశానికి కబడ్డీ లీగ్ వేదికైంది.