ఆ మ్యాచ్ తొలిరోజు ఆటను తనయుడు అర్జున్తో కలిసి వీక్షించిన సచిన్... ఆ రోజు ఆటలో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత, గెలుస్తుందన్న అంచనాకు వచ్చానని వివరించాడు. యువజట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. మొదటి రోజు మ్యాచ్ అనంతరం, అర్జున్తో మనదే పైచేయి అని చెప్పాను అని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తొలి ఇన్నింగ్స్లో బాగా ఆడి ఉంటే మాత్రం వారికే మెరుగైన అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డాడు.