అయితే మ్యాచ్ అనంతరం విలేకరులు సచిన్ తెలుసా? అని ప్రశ్నించగా.. బెక్హామ్ను ఒకసారి కలిశా, సచిన్ మాత్రం తెలియదని షరపోవా సమాధానం చెప్పింది. దీంతో సచిన్ అభిమానులు షరపోవాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మా అబ్బాయితో చెప్పా... చారిత్రక లార్డ్స్ మైదానంలో భారత్ విజయం సాధిస్తుందని ముందే అంచనా వేశానని లెజెండరీ బ్యాట్స్మన్ సచిన్ తెలిపాడు. ఓ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ తన మనోగతం వెల్లడించాడు. తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది అద్భుతమైన ప్రదర్శన అని అన్నాడు. లార్డ్స్ టెస్ట్ తొలి రోజు ఆట చూశానని, మనదే పై చేయి అవుతుందని మా అబ్బాయి అర్జున్తో చెప్పానని తెలిపాడు.