ప్రీతిజింటా, నెస్ వాడియా మధ్య గొడవ వాస్తవమే!

శనివారం, 5 జులై 2014 (11:06 IST)
బాలీవుడ్ నటి ప్రీతీజింటా, వ్యాపారవేత్త నెస్ వాడియా వ్యవహారంలో కొంతమందిని ముంబయి పోలీసులు విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో ఐపీఎల్ 'కింగ్స్ ఎలెవన్ పంజాబ్' ఆతిథ్యం విభాగ మేనేజర్ తారా శర్మ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, ప్రీతీ, నెస్ వాడియా మధ్య గొడవ వాస్తవమేనని తెలిపారు. 
 
మే 30న స్టేడియంలో సీట్ల కేటాయింపుపై వారిద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాదన జరిగిందని ఆమె వెల్లడించారు. అదే సమయంలో తనపైనా నెస్ అరిచారని చెప్పారు. ఈ వాంగ్మూలాన్ని రెండు రోజుల కిందట (గురువారం) నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి