పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తాచాటాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇక వామప్ మ్యాచ్లో కెప్టెన్ ధోనీ ఆడే అవకాశాలు కన్పించడం లేదు. వివిధ విన్నింగ్ కాంబినేషన్లు పరీక్షించాలని ధోనీ భావిస్తున్నాడు. దీంతో యువ కీపర్ శాంసన్కు అవకాశం దక్కనుంది. కాగా గురువారం కూడా టీమిండియా నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చింది.
సహాయ కోచ్లు పెన్నీ, డేవ్స్ పర్యవేక్షణలోనే భారత్ నెట్ ప్రాక్టీస్ చేసింది. కొత్త సిబ్బంది ఇంకా జట్టుతో చేరలేదు. కాగా, కెప్టెన్గా ధోనీనే కొనసాగాలని టీమిండియా డైరెక్టర్గా నూతనంగా నియమితులైన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అన్నాడు.