టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ వ్యాఖ్యాత సౌరభ్ గంగూలీ బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే గురువారం బీజేపీ పెద్దలతో సమావేశమైన గంగూలీ వారితో చర్చిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. 2008లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యుడిగా ఉండటమే కాకుండా క్రికెట్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెల్సిందే.