విదేశాల్లో టెస్ట్ మ్యాచ్లు ఆడలేకుంటే వన్డే మ్యాచ్లు ఆడుకోవాలంటూ భారత క్రికెటర్లపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మండిపడ్డారు. ఓవల్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ కేవలం 94 పరుగులకే ఆలౌట్ కావడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. టెస్టులు ఆడటం చేతకాకపోతే వన్డేలు మాత్రమే ఆడుకోవాలని అన్నారు. జట్టు మొత్తం కలిసి కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయారని మండిపడ్డారు.