ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా పరాజయంతో కోచ్, కెప్టెన్ ధోనీపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ధోనీని ఇప్పట్లో తొలగించేది లేదని సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా పరాజయంలో విరాట్ కోహ్లీ విఫలం ప్రధానమైనదేనని బీసీసీఐ ఒప్పుకుంది.
‘‘వారిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ విషయం తెలిసినందునే కోహ్లీ వెంట వచ్చేందుకు అనుష్కకు అనుమతిచ్చాం’’ అంటూ బీసీసీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. అనుష్కను తోడు తెచ్చకున్న కోహ్లీ, రెండు ఇన్నింగ్స్లు బాగానే ఆడినా, ఆ తర్వాత ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే.