విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు త్వరలో వివాహం చేసుకోబోతున్నామని చెప్పడంతోనే ఇంగ్లండ్ టూర్కు ఇద్దరూ కలిసి వెళ్లేందుకు అనుమతినిచ్చామని బీసీసీఐ స్పష్టం చేసింది. ఇటీవల ఇంగ్లాండ్లో జరిగిన టెస్టు సిరీస్కు విరాట్ కోహ్లితో పాటు ఆయన గర్ల్ ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ అనుష్కను అనుమతించడంపై ప్రస్తుతం దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. బీసీసీఐ విరాట్కు గర్ల్ ఫ్రెండ్ను తీసుకెళ్లేందుకు ఎలా అనుమతులు ఇచ్చారంటూ విమర్శలు ఎదుర్కొంటోంది.