ఐసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో విండీస్, పాకిస్థాన్‌లకు చోటు!

శనివారం, 28 జూన్ 2014 (12:34 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కమిటీలో వెస్టిండీస్, పాకిస్థాన్ జట్లకు కూడా చోటు కల్పించారు. ఈ మేరకు మెల్ బోర్న్‌లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిటీలో మొత్తం ఐదు సభ్య దేశాలుంటాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ శాశ్వత సభ్యదేశాలు కాగా, మరో రెండు దేశాలకు ఏడాది ప్రాతిపదికన అవకాశం కల్పిస్తారు. 
 
కాగా, ఈ కమిటీలో దక్షిణాఫ్రికాకు చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. అయితే, అదే దేశానికి చెందిన డేవ్ రిచర్డ్సన్‌పై వాత్సల్యం ప్రదర్శించారు. సీఈవోగా ఆయన పదవీకాలాన్ని రెండేళ్ళు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఐసీసీ చీఫ్‌గా సస్పెండ్ అయిన ఎన్. శ్రీనివాసన్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఐసీసీ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎంపికపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి